గర్భిణికి రక్తదానం...! 

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • మానవత్వం చాటుకున్న వార్డు మెంబర్ ప్రవీణ్ కుమార్
  • కృతజ్ఞతలు తెలిపిన గర్భిణీ కుటుంబ సభ్యులు 
  • రక్తదానం ప్రాణదానం..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : అపదలో ఉన్న వారికి అండగా నిలిచి తన ఉదారతను చాటుకున్నారు అంతారం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ మ్యాతరి ప్రవీణ్ కుమార్. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం ఐనెల్లి గ్రామానికి చెందిన మాసని వీరమణి (భర్త మోహాన్) తన రెండవ కాన్పు కోసం తాండూరు పట్టణంలోని జేబీ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.ఆమెకు రక్త కణాలు తక్కువగా ఉండటంతో, అత్యవసరంగా 'బి-పాజిటివ్' రక్తం అవసరమని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని అంతారం గ్రామ యువకుడు కోస్గి హనుమంతు ద్వారా తెలుసుకున్న అంతారం 4వ వార్డు బిఆర్ఎస్ పార్టీ మెంబర్ మ్యాతరి ప్రవీణ్ కుమార్, తక్షణమే ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు. సకాలంలో రక్తం అందడంతో వైద్యులు గర్భిణికి సురక్షితంగా చికిత్స అందించారు.సకాలంలో స్పందించి ప్రాణదాతగా నిలిచిన ప్రవీణ్ కుమార్‌కు, సహకరించిన రాజు పటేల్, హనుమంతులకు గర్భిణి మేనమామ మ్యాతరి చందు మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *