ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా సిఎం కార్యాలయం పెత్తనం సాగించింది. ప్రభుత్వ విధానాలకు వివరణలు, సందేహ నివృత్తి అనే ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసింది. సోషల్ మీడియా ప్రచారం, ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు, దాడులతో నోళ్లు మూయించే ప్రయత్నాలు జరిగాయి. కోవిడ్ ఆంక్షలు తొలగిన తర్వాత తప్పుడు సర్వేలతో మళ్లీ అధికారం మనదేనంటూ ఊదరగొట్టారు. ఈ సర్వేలు వాటి శాస్త్రీయత, వాటిని నిర్వహించే వారి వ్యవహార శైలిపై విమర్శలు వచ్చినా జగన్ ఏనాడు ఖాతరు చేయలేదు.