Yuzvendra Chahal RCB : ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తన చెత్త ప్రదర్శనతో అందరిని నిరాశపరుస్తోంది. 8 మ్యాచుల్లో 7 ఓటములతో.. టేబుల్ బాటమ్లో స్థిరపడింది. ఇదే కొనసాగితే.. ఆర్సీబీ ఈ సీజన్ని చివరి స్థానంలోనే ముగించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ మినహా.. ఆ జట్టుకు పెద్దగా ప్లస్ పాయింట్లు కనపడటం లేదు. అదే సమయంలో.. ఆర్సీబీ మాజీ ప్లేయర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వెందర్ చాహల్.. ఐపీఎల్ 2024లో దుమ్మురేపుతున్నాడు. చాహల్ని వదులుకుని ఆర్సీబీ ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతోంది. అందుకే.. అతడిని వెనక్కి తెచ్చుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఆ జాబితాలో.. మాజీ క్రికెటర్, ఆర్సీబీ మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్ప కూడా చేరాడు.
‘చాహల్ని వెనక్కి తెచ్చుకోండి..’
ముంబై ఇండియన్స్తో జరిగిన ఆర్ఆర్ మ్యాచ్లో తన 200వ వికెట్ తీశాడు చాహల్. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. కాగా.. 2022లో చాహల్ని ఆర్సీబీ వదులుకుంది. ఆర్సీబీ తరఫున 8 సీజన్లు ఆడిన అతను.. 113 మ్యాచుల్లో 139 వికెట్లు పడగొట్టాడు. ఇంతటి ప్రతిభావంతమైన బౌలర్ని ఆర్సీబీ ఎందుకు వదులుకుందో! ఏదేమైనా.. చాహల్ లేని లోటు స్పష్టం కనిపిస్తోంది. 2022 నుంచి రాజస్థాన్ రాయల్స్కు ఆడిన 28 మ్యాచుల్లో చాహల్లో 60కిపైగా వికెట్లు తీశాడు.
Yuzvendra Chahal IPL : ఈ నేపథ్యంలో.. చాహల్ని ఆర్సీబీ వదులుకోవడాన్ని ఊతప్ప తప్పుపట్టాడు. ఐపీఎల్ గెలవాలంటే.. చాహల్ని వెనక్కి తెచ్చుకోవాలని సూచించాడు.
“నేనైతే ముందు యుజ్వెందర్ చాహల్ దగ్గరికి వెళతాను. ఆర్సీబీకి తిరిగి రావాలని అడుగుతాను. అతడి కోసం ఏదైనా చేస్తాను. వెనక్కి తెచ్చుకోవడానికి ఎంత దూరమైన వెళతాను. అంతేకాదు.. హర్షల్ పటేల్ దగ్గరికి కూడా వెళతాను. వెనక్క రమ్మని అడుగుతాను. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ని చూడండి.. ఫాఫ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తిక్. మరి బౌలర్లు? ఆర్సీబీకి గొప్ప బ్యాటర్లు ఉన్నారు. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, ట్రావిస్ హెడ్, షేన్ వాట్సన్.. ఇలా చాలా మంది ఆడారు,” అని టీఆర్ఎస్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఊతప్ప.
IPL 2024 latest news : చాహల్ ఒక్కడే కాదు.. చాలా మంది ప్రతిభావంతమైన ప్లేయర్లను వదులుకుంది ఆర్సీబీ. వారందరు వేరే ఫ్రాంఛైజ్లకు వెళ్లి సత్తా చాటారు. ఆర్సీబీ తరఫున 15 మ్యాచ్లు ఆడిన శివమ్ దూబే.. 169 పరుగులు చేశాడు. ఆ తర్వాత సీఎస్కేకి వెళ్లిపోయాడు. దేవ్దత్ పడిక్కల్ కూడా.. 2020లో ఆర్సీబీ తరఫున సత్తా చాటి.. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా పొందాడు. తన మొదటి ఐపీఎల్లోనే 400కుపైగా రన్స్ చేసిన రెండో అన్క్యాప్ట్డ్ ఇండియా ప్లేయర్గా నిలిచాడు. కానీ.. అతడిని కూడా ఆర్సీబీ వదులుకుంది. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్లో దుమ్మురేపుతున్న హెన్రిక్ క్లాసెన్, అభిషేఖ్ శర్మలు కూడా గతంలో ఆర్సీబీకి ఆడినవారే!
“ఇప్పుడు డొమెస్టిక్ ప్లేయర్స్ విషయానికి వద్దాము. నన్ను, మనీశ్ పాండే, కరుణ్నాయర్, మయాంక్ అగర్వాల్, దేవ్దత్ పడిక్కల్.. అందరిని ఆర్సీబీ వదిలేసింది. విరాట్ కోహ్లీ తర్వాత.. అత్యధిక పరుగులు సాధించిన ఇండియన్ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్. క్రేజీ కదా! ఇక్కడే అర్థమైపోతోంది. విరాట్ కోహ్లీ ఎలాగైనా పరుగులు చేస్తాడు. కానీ దానిని కట్టడి చేసే వారు కూడా ఉండాలి కదా. 2012, 2014లో కేకేఆర్ గెలిచినప్పుడు.. స్కోర్ 170 మాత్రమే. పరుగులు చేయడానికి కష్టపడాలి. బౌలింగ్ అలా ఉండాలి. ఆర్సీబీకి అది చేతకాదు. బౌలింగ్, మిడిల్ ఆర్డర్పై ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. వారితో జర్నీ చేయాలి. వారిపై నమ్మకం ఉంచాలి. ఆర్సీబీ తరఫున ఆడిన ప్లేయర్లు.. ఈ ఒక్క ఐపీఎల్లోనే 25మంది ఉన్నారు!” అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.