Wednesday, October 16, 2024

CM Jagan Stone Pelting Case : సీఎం జగన్ పై రాయితో దాడి కేసులో ట్విస్ట్, దుర్గారావు రిలీజ్-A2 ఎవరు?

నా తప్పు లేదని తెలిసి విడిచిపెట్టారు- దుర్గారావు

విడుదల అనంతరం దుర్గారావు మీడియాతో మాట్లాడారు. విచారణలో టీడీపీ నేత బోండా ఉమా (Bonda Uma)చేయమని చెప్పారు కదా అని పోలీసులు ‌ ప్రశ్నించారని దుర్గారావు తెలిపారు. సీఎం జగన్ పై దాడికి పాల్పడిన సతీష్ తమ కాలనీలో ఉంటాడు కానీ అతనితో పరిచయంలేదన్నారు. రాయి దాడిలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని చాలా మంది పోలీసులు తనను విచారించారన్నారు. తన ఫోన్ తనిఖీ చేశారని, అయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు దుర్గారావు. టీడీపీలో(TDP) యాక్టివ్ గా ఉన్న కారణంగానే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. మూడు రోజుల పాటు అనేక కోణాల్లో విచారించారని, తన తప్పు లేదని తెలిసి విడిచిపెట్టారన్నారు. ఈ కేసులో ఏ ఆధారం లేకపోవడంతో 164 నోటీసులు ఇచ్చి.. పోలీసులే తనను ఇంటి వద్ద విడిచిపెట్టారన్నారు. తన కుటుంబ సభ్యులుతో సంతకాలు‌ చేయించుకున్నారని దుర్గారావు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana