Tuesday, October 22, 2024

Phone Tapping Case : 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలన్నీ బయటపెట్టండి

మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ సర్కార్ ఉంది. పదేళ్లు అధికారంలోకి ఉంది. నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… కాంగ్రెస్ పార్టీలోని గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మేము కాదు… కాంగ్రెస్ నేతలే కిరణ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. 2014 నుంచే కాదు… 2004 నుంచి జరిగిన అన్ని విషయాలన్నీ బయటికి తీయండి. కేవలం ప్రభుత్వమే మారింది. కానీ అధికారులు మాత్రం వారే ఉన్నారు. ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ఆ రోజు మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా హైదరాబాద్ సీపీగా పని చేశారు . ఈ రోజు డీజీపీ రవి గుప్తా ఆ రోజు హోం సెక్రెటరీ.. వీళ్ళందరూ ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు.. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్‌ జరిగితే ఈ అధికారులకు తెలియదా…? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana