ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, లక్షీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, వసంతోత్సవాలు వంటివి చేసుకోవడం చాలా పుణ్యప్రదమని చిలకమర్తి తెలిపారు. పౌర్ణమిని అత్యంత అదృష్టవంతమైన రోజుగా పరిగణిస్తారు. అందులో ఫాల్గుణ పౌర్ణమి మరింత విశిష్టత సంతరించుకుంటుంది. ఈ సంవత్సరం మార్చి 25న ఫాల్గుణ పౌర్ణమి వచ్చింది. మార్చి 24 ఉదయం 09. 54కు పౌర్ణమి తిథి ప్రారంభమై, 25 మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుందని చిలకమర్తి తెలిపారు.