రాష్ట్రపతి పాలనకు అవకాశం?
ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా కు, అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వానికి చాన్నాళ్లుగా సత్సంబంధాలు లేవు. నిజానికి, లిక్కర్ స్కామ్ పై విచారణ జరపాలని మొదట ఆదేశాలు జారీ చేసిందే లెఫ్ట్ నెంట్ గవర్నర్. ఈ పరిస్థితుల్లో లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా రంగంలోకి దిగి, ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, తానే పరిపాలన పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా? అనే విషయంలో కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో చట్టపరంగా రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి పడిపోతేనే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల వరకు పరిపాలనా బాధ్యతలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ వద్దే ఉంటాయి.