Friday, October 18, 2024

Encounter: గడ్చిరోలి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్; నలుగురు నక్సల్స్ మృతి

చనిపోయిన నక్సలైట్లు వీరే..

గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక పోరాట విభాగం సీ-60, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్విక్ యాక్షన్ టీంకు చెందిన పలు బృందాలు మంగళవారం ఉదయం గడ్చిరోలి అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. రేపన్ పల్లి సమీపంలోని కోలామర్క పర్వతాల్లో సీ-60 యూనిట్ బృందం గాలింపు చేపడ్తుండగా.. వారిపై నక్సలైట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, దంతో, భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు (encounter) జరిపారని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా నలుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిపై రూ.36 లక్షల నగదు బహుమతి ఉందని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీ, ఒక కార్బైన్, రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన నక్సలైట్లను వివిధ నక్సల్స్ కమిటీల కార్యదర్శులు వర్గీష్, మగ్తూ, ప్లాటూన్ సభ్యులు కుర్సాంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేష్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana