బైరాన్పల్లి, గుండ్రాన్పల్లి , పరకాల జెండా ఉద్యమం, ఈశ్వరయ్య, గండయ్య గ్యాంగ్ సాహసంతో తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రజాకార్లను ఎదురించి ప్రజలు సాగించిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించాడు. వారి పోరాటాన్ని అణిచివేసేందుకు రజాకర్లు చేసిన హింస, రక్తపాతం మనసుల్ని కదిలిస్తాయి. తెలుగు మాట్లాడిన పిల్లలను రజాకార్లు క్రూరంగా హిసించడం, బతుకమ్మ ఆడిన మహిళల్ని వివస్త్రలు చేయడం, మానభంగాలు, మారణ హోమం సినిమాలో వాస్తవిక కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్.