మరోవైపు ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జనవరి 9న ఏపీలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయించారు.