సీఎం వైఎస్ జగనన్నను పులి, సింహం అని పొగుడుతున్నారని ఎవరికి పులి..ఎవరికి సింహం..? అని ఏపీసీసీ చీఫ్ YS షర్మిల ప్రశ్నించారు. సాక్షి పేపర్ కి పులినా..? ఆయన సోషల్ మీడియాకి సింహమా..? అని ధ్వజమెత్తారు. ఒక్కసారి బీజేపీ మీద మీ పంజా విప్పండని, దమ్ముంటే గాండ్రించండని షర్మిల సవాల్ విసిరారు. వైసీపీ సర్కారును ప్రశ్నిస్తే ఈ స్థాయిలో బెదిరిస్తున్నారా.. సొంత ఆడబిడ్డ మీద బూతులు మాట్లాడుతున్నారని ఆమె బాధపడ్డారు. వ్యక్తిగత దూషణలు తప్ప వైసీపీకి సాధ్యమైంది ఏదీ లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.