Wednesday, October 23, 2024

రాయలసీమలో రవితేజ కి తిరుగులేదు..అనంతపురం సంఘటనే నిదర్శనం  

తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు రవితేజ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చి చిన్న చిన్న పాత్రలుతో మొదలుపెట్టి టాప్ హీరో రేంజ్ కి ఎదిగాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఆయనకీ అభిమానగణం ఉంది. అభిమానులతో పాటు డైరెక్టర్ లు కూడా ఆయన్ని మాస్ మాహారాజా అని పిలుచుకుంటారు.తాజాగా ఆయన ఈగల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా  అభిమానులు చేసిన పని ఇప్పుడు రవితేజ కి ఉన్న క్రేజ్ ని చాటి చెప్తుంది.

రాయలసీమలోని  అనంతపురం కి చెందిన రవితేజ అభిమానులు తమ అభిమాన కధానాయకుడి సినిమా ఈగిల్ రిలీజ్ సందర్భంగా భారీ ఆటో ర్యాలీని నిర్వహించారు.అనంతపురం పట్టణ విధుల్లో జరిగిన ఈ ర్యాలీలో రవి తేజ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ ఆద్యంతం ఎంతో హంగామాగా సాగి రవి తేజ కి ఉన్న క్రేజ్ ని అందరికి తెలిసేలా చేసింది. పైగా అభిమానులు ర్యాలీ అనంతరం ఆటోలతో  ఈగిల్ టైటిల్ ని కూడా వెయ్యడం విశేషం. అనంతరం అభిమానులు ఈగిల్ సినిమా భారీ విజయాన్ని సాధించాలని కోరుకున్నారు.

ఈగిల్ లో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లు జోడి కడుతుండగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వాన్ని వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.హనుమాన్ విలన్ వినయ్ రాయ్,మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలని పోషించారు. సుమారు 80 కోట్ల బడ్జట్ తో ఈగల్ చిత్ర నిర్మాణాన్ని జరుపుకుంది.

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana