మహా మృత్యుంజయ మంత్రం ప్రయోజనాలు
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అద్భుతమైన శక్తి వస్తుందని నమ్ముతారు. ఈ మంత్రం శక్తి భక్తుడి అంతర్గత బలం భావాన్ని తెలియజేస్తుంది. ధైర్యం, విపత్తు, ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించే శక్తిని అందిస్తుంది. దైవిక శక్తిని ప్రేరేపిస్తుంది. ప్రతికూల, దుష్ట శక్తులు, ప్రమాదాలు, అనారోగ్యాల నుంచి రక్షణ కవచంగా ఈ మంత్రం మనల్ని కాపాడుతుంది. జననం, మరణం గురించి ఒక స్పష్టత వస్తుంది. అమితమైన భక్తితో స్పష్టంగా ఈ మంత్రాన్ని జపించినప్పుడు మరణానికి మీరు భయపడరు.