నగరంలో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
అనంతరం అతడి నుంచి 557 గ్రాముల కొకైన్,902 ఎక్స్టాసి పిల్స్,105 ఎల్ ఎస్డీ బ్లాట్స్, 215 గ్రాముల చరస్, 21 గ్రాముల హెరాయిన్ తో పాటు ఇతర డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.8 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంబయి(Mumbai)లో బట్టల వ్యాపారం చేస్తానని 2009లో బిజినెస్ వీసా తో ఇండియాకు వచ్చిన నిందితుడు…..ఆ తర్వాత గోవాలో కొందరు నైజీరియన్లతో కలిసి డ్రగ్ సరఫరా దందా మొదలు పెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. వీసా ఎంక్వైరీ కేసులో ఆరు నెలల పాటు నిందితుడు గోవా జైల్లో ఉన్నాడని, 2017లో డ్రగ్ సప్లై చేస్తుండగా నార్కోటిక్స్ బ్యూరోకు పట్టుబడినట్లు పోలీసులు వివరించారు. ముంబయి, గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకొని హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.