Thursday, October 24, 2024

MP Vijayasai Reddy :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న వైసీపీ ఎంపీ, కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

Complaint On Ysrcp MP Vijayasai Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభలో ఆన్ రికార్డ్ లో విజయ సాయిరెడ్డి మాట్లాడిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఏపీలో జరిగే ఎన్నికలకు వైసీపీకి బీఆర్ఎస్ ఫండింగ్ చేస్తుందన్నారని ఆరోపించారు. వైసీపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సుస్థిర పాలన అందిస్తుందన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయ సాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావన్నారు. విజయసాయి రెడ్డి వాఖ్యల వెనుక కుట్ర కోణాన్ని సీబీఐతో విచారణ చేయాలని కాల్వ సుజాత డిమాండ్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్ విజయ సాయి రెడ్డి వాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లలో విజయసాయి రెడ్డిపై విజయా రెడ్డి, కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana