Saturday, October 19, 2024

 సిఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కును  ఇచ్చిన చిరంజీవి

posted on Sep 16, 2024 1:49PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని   ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సోమవారం కలిసారు. సిఎంరిలీఫ్ పండ్ కు 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తన కుమారుడు రాంచరణ్ తరపున కూడా 50 లక్షల చెక్కును సిఎంరిలీఫ్ ఫండ్ కు అంద జేశారు. చిరంజీవి సచివాలయానికి వచ్చినప్పుడు  మంత్రి  సీతక్క కూడా అక్కడే  ఉన్నారు చెరో రెండు చెక్కులను అంద జేయడానికి వచ్చిన మెగాస్టార్ తో రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. యుపిఎ హాయంలో చిరంజీవి కేంద్రమంత్రిగా పని చేసిన సంగతితెలిసిందే. వీరి భేటీలో  తెలంగాణ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.  ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లో వచ్చిన చిరంజీవి ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. తర్వాత కేంద్ర మంత్రి పదవిని అధిరోహించారు.  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్నిపునరుద్దరించుకోని చిరంజీవి ఆ పార్టీకి దూరమయ్యారు.  రాజీనామా చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేదు. ఎపిలో  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన   కూటమి ప్రభుత్వానికి మద్దత్తు పలికారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన జనసేన 21 స్థానాలు పోటీ చేసి అన్ని స్థానాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల కంటే సినిమాల మీద కాన్ సన్ ట్రేట్ చేస్తున్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana