మాజీ సీఎం దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని సీఎం వద్ద పెట్టొద్దని సీఎంవోను ఐబీ ఆదేశించింది. సీఎం దావోస్ పర్యటన ముగిసిన అనంతరం భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చిందని ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని మార్చారు.