బుడమేరు కాలువకు గండ్లు పడి విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయిపోయాయి. ఇప్పటికీ నీటిలోనే పలు కాలనీల్లోని ఇళ్లు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న సాయం ప్రచారంపై స్థానికుల ప్రజలు పెదవి విరుస్తున్నారు. తమకు ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు. కరెంట్ కూడా రెండు రోజుల క్రితమే తమ ఇళ్లకు ఇచ్చారని చెప్పారు.