posted on Sep 12, 2024 3:17PM
తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు.బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు.