Home ఆంధ్రప్రదేశ్ AP Sachivalayam Employees : సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఇకపై రోజుకు మూడుసార్లు...

AP Sachivalayam Employees : సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు నమోదు

0

సచివాలయ శాఖ ప్రక్షాళన!

ఏపీలో వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో కూడా ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. సచివాలయాల శాఖపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరాన్ని మించి ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో అదనపు ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,26,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Exit mobile version