నిమజ్జనం అంటే అక్కడే..
హైదరాబాద్ వాసులకు గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగరే గుర్తుకొస్తుంది. నగరంలో ఖైరతాబాద్ గణపతి నుంచీ.. గల్లీలోని బుల్లి గణపతుల వరకూ.. అన్నింటినీ ట్యాంక్బండ్ దగ్గరే ప్రతి ఏటా నిమజ్జనం చేస్తారు. దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది. గణపతి నిమజ్జనాన్ని చూసేందుకు తెలంగాణ ప్రజలే కాకుండా.. ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ఆ రద్దీకి తగ్గట్టు పోలీసులు ఏర్పాట్లు చేసేవారు. కానీ.. ఈ ఏడాదే కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆ గందరగోళానికి బ్రేక్ వేసింది.