సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో 264 మ్యాచ్లాడిన మహేంద్రసింగ్ ధోనీ 5,243 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84 పరుగులు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ధోనీ.. తన కెప్టెన్సీతో చెన్నై టీమ్కి 2008 నుంచి ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడు.