హైదరాబాద్లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై కేసు నమోదు అయ్యింది. ఆరుగురు ఆఫీసర్లపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ ఏపీవో, బాచుపల్లి తహశీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై కేసు నమోదు అయ్యింది. ఈవోడబ్ల్యూలో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో మరికొందరు అధికారులపైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.