ఈ మేరకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు గురువారం ఆదేశాలను జారీ చేశారు. ఏసీపీ స్రవంతి రాయ్ ని విచారణాధికారిణిగా నియమించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను అందజేయాలని సీపీ ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా విజయవాడ పోలీసులు ముంబైకి వెళ్లే అవకాశాలున్నాయి.