2019-2020 ఆర్థిక సంవత్సరం నుండి 2023-2024 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆర్థిక సాయంగా చేపట్టిన రోడ్లలో మూడు జిల్లాల్లోనే ఎక్కువ పనులు ఉన్నాయి. వాటిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన కడప జిల్లా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందిన కర్నూలు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డికి చెందిన చిత్తూరు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్త రోడ్లను నిర్మించారు. ఇతర జిల్లాల్లో పనులు తక్కువగా మంజూరయ్యాయి. నిర్మాణ పనులు పూర్తి కావడంతో వాటికి బిల్లుల్ని మంజూరు చేశారు.