Nandamuri Harikrishna: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ ఆరో వర్ధంతిని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించినపుడు ఉమ్మడి ఏపీలో చైతన్యరథంపై చేసిన యాత్రకు హరికృష్ణ సారథిగా వ్యవహరించారని టీడీపీ నేతలు గుర్తు చేసుకున్నారు.