షాక్లో రాజు..
ఈ ఘటనతో రాజు షాక్లోకి వెళ్లాడు. ఏమి తెలియనట్టుగానే ఇంటికెళ్లాడు. నవీన్, రాము తల్లితండ్రులు వారి కుమారులిద్దరు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. తమ కుమారులు ఎవరితో వెళ్లారో కనుక్కుంటూ.. రాజు దగ్గరికి వచ్చారు. చివరకు జరిగిన ఘటన గురించి రాజు వివరించడంతో.. మృతుల తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొన్ని గంటల ప్రయత్నం తర్వాత.. నవీన్, రాముల మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం బయటకు తీశారు.