posted on Aug 27, 2024 2:32PM
ఎన్నికల ఫలితాల అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టిన ప్రతిసారీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు, తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డి ప్రజెన్స్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని భావించిన పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా ఆయన నియోజకవర్గంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. తాజాగా ఇటీవల పెద్దారెడ్డి తన నివాసానికి వచ్చిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి.
ఈ ఘర్షణల్లో వాహనాలు దగ్ధం అయ్యాయి, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో పోలీసులు పెద్దారెడ్డిని నియోజకవర్గం బయటకు సాగనంపారు. పటిష్ఠ బందోబస్తు మధ్య పెద్దారెడ్డిని అనంతపురంకు తరలించిన పోలీసులు ఇకపై ముందస్తు అనుమతి లేకుండా నియోజకవర్గంలోకి ప్రవేశించవద్దని నిషేధం విధించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, పర్యవేక్షించిన డీజీపీ నియోజకవర్గంలో హింసాకాండకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికలో తెలుగుదేశం, వైసీపీకి చెందిన కీలక నేతల ప్రజన్స్ వల్లనే తాడిపత్రిలో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పుతోందని డీజీపీ పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగానే ఎస్పీ పెద్దారెడ్డిని నియోజకవర్గంలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు.