అయితే ఆ నరేషి మీనా ఈ సీజన్లో తొలి క్రోర్పతి అయ్యేలా కనిపించారు. ఆమె ముందు రూ.కోటి విలువైన ప్రశ్న ఉంచాడు బిగ్ బీ. కానీ ఆమె మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే.. “వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో లీలా రౌ దయాల్ ఎవరిని ఓడించి ఇండియా తరఫున సింగిల్స్ మ్యాచ్ గెలిచి తొలి భారతీయురాలిగా నిలిచింది?” అని బిగ్ బీ అడిగాడు. దీనికి ఇచ్చిన ఆప్షన్లు.. లాటీ డాడ్, గ్లాడిస్ సౌత్వెల్, మే సేటన్, కిట్టీ గాడ్ఫ్రే.