Wednesday, October 16, 2024

తీవ్ర గాయాలకు 50 లక్షలు.. స్వల్ప గాయాలకు 25 లక్షలు.. | achutapuram sez accident| chandrababu visit achutapuram sez

posted on Aug 22, 2024 1:12PM

అచ్యుతాపురం సెజ్ ఆస్పత్రి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్ళిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. చంద్రబాబు ఈ సందర్భంగా ప్రమాద వివరాలను ప్రత్యక్ష సాక్షులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షలు ఎక్స్.గ్రేషియాగా అందించనున్నట్టు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. మృతుల కుటుంబాల వారికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందనున్న విషయం తెలిసిందే. గాయపడిన వారు అధైర్య పడాల్సిన అవసరం లేదని, అందరికీ ప్రభుత్వం అండగా వుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందరికీ వైద్యం చేయించడం మాత్రమే కాకుండా.. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా ప్రభుత్వం చేయిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana