Sunday, October 27, 2024

స్పీడ్ తగ్గించిన హైడ్రా… రంగనాథ్ చుట్టూ బిగుస్తున్న రాజకీయ ఉచ్చు

posted on Aug 21, 2024 2:55PM

హైడ్రా స్పీడ్ తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరిధిలో ఉన్న ఫామ్ హౌజ్ ల  హైడ్రా కూల్చివేయనున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కెటీఆర్ ఫామ్ హౌజ్ కూల్చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కెటీఆర్ రియాక్ట్ అయ్యారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌజ్ లేదని కెటీఆర్ చెప్పుకొచ్చారు. కాని తన మిత్రుడి ఫామ్ హైజ్ లీజుకు తీసుకున్నానని కెటీఆర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ ఫామ్ హౌజ్ కూల్చాలనుకుంటే కూల్చండి. కానీ తనతో పాటు హైడ్రా బృందం రావాలని కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజ్ లు కూల్చేయాలని కండిషన్ పెట్టారు. హైదరాబాద్‌లో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరడా ఝుళిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో దానిని కూల్చివేసే అవకాశం ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చకుండా చూడాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిని కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్‌పల్లి రెవిన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెందినదిగా ప్రచారంలో ఉంది.అలాగే, హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూడా కూల్చివేయాలని ఫిర్యాదులు వచ్చాయి. జన్వాడ ఫామ్ హౌస్, ఎన్ కన్వెన్షన్‌తో పాటు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఇతర ప్రముఖుల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా చెబుతోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు చెరువులను ఈరోజు పరిశీలిస్తున్నారు. ఆక్రమణకు గురైన బతుకమ్మ కుంటను కూడా పరిశీలించారు.

జన్వాడ ఫామ్ హౌస్ కూల్చవద్దని ప్రవీణ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. ఇది స్వయంప్రతిపత్తిగల సంస్థ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణం జరిగిన 15 – 20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణాలని కూల్చి వేయడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది.

చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణార్హమైనది కాదన్నారు. ఈ ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని తెలిపారు. జీవో 111 పరిధిలోని భూములు, ఫామ్ హౌస్‌లను నీటి పారుదల శాఖ చూస్తోందన్నారు. వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు మాత్రం లేదని ఏఏజీ తెలిపారు. అనంతరం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

హైకోర్టు అక్షింతల నేపథ్యంలో హైడ్రా స్పీడ్ తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారాలకు కాంగ్రెస్ కళ్లెం వేయనుంది.  దానం నాగేందర్ నేతృత్వంలో కొందరు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెంచుతున్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana