Sunday, October 27, 2024

వృద్ధుల ఇన్స్యూరెన్స్ లపైనా బాదుడేనా? | tax on insurance| union| government| illogical| taxsystem| gst| source

posted on Aug 21, 2024 2:35PM

భారత్ లో విక్రయ పన్నును, సహా అన్ని పన్నులను జీఎస్టీ లో కలిపి విస్తృతంగా పన్ను చెల్లింపు దారుల ను  పెంచి ఆదాయం పెరిగేలా బీజేపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. జీఎస్టీ పేర మోడీ సర్కార్ తీసుకువచ్చిన పన్ను విధానం ప్రజలకు మోయలేని భారంగా మారింది.  ప్రజల అవసరాలు, వారి శ్రేయస్సు దృష్ట్యా ఎప్పటికప్పుడు సవరణలు చేస్తామనీ, తరచూ రాష్ట్రప్రభఉత్వాలతో చర్చించి ప్రజల అభీష్టాలమేరకు మార్పులు చేస్తామని చెప్పిన మోడీ సర్కార్ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.  హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలి లేదా పూర్తిగా ఎత్తివేయాలంటూ  స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  చేసిన ప్రతి పాదనను  కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అక్కడితో ఆగకుండా గడ్కరీ ప్రతిపాదనపై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆయనను అవమానించేవిగా ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూళ్లలో హేతుబద్ధతకు తిలోదకాలిచ్చి, ప్రజల డిమాండ్లను పట్టించుకోవడం లేదు.  పన్నులు పెంచడం తన హక్కు.. వాటిని కట్టడం ప్రజల విధి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పెట్రోల్ పై జిఎస్టీ విధించాలని ప్రజలు నుంచి వస్తున్న డిమాండ్లను పట్టించుకోవడంలేదు. సర్ చార్జీ, సుంకాలు పేరుతో అటు కేంద్రం,ఇటు రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా పన్నులు వేస్తున్నాయి.  అలాగే వంటగ్యాస్ సిలిండర్ల పై కూడా అదే ధోరణి కనిపిస్తోంది. ప్రజలు కడుతున్న పన్నులతో పాలకులు ప్రభుత్వాలు నడుపుతున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పన్ను రాబడిని వాడుకుంటున్నారు. ప్రజా ధనాన్ని పథకాలపేరుతో పందేరం చేస్తున్నారు. ఆహారం, దుస్తులు,ఇల్లు ప్రతివ్యక్తి సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు. కాని హోటల్ కు వెళితే జీఎస్టీ బాదుడు, దుస్తులు కొనాలంటే కనీస ధర రూ.500 నుంచి 1000 వరకూ కావాలి. అలాగే నగరాల్లో ఇల్లు కొనాలంటే పన్నులు రూపేణా లక్షల్లో బాదేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు.బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేటప్పుడు వడ్డీల పేర విపరీతంగా బాదేస్తున్నాయి.కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టేవారు బ్యాంకు రుణాలకు వెళ్లడం లేదు. బ్యాంకు రుణ వితరణ రేటు తగ్గుతున్నదని రిజర్వ్ బ్యాంక్ నివేదికలు చెబుతున్నాయి. ఆర్ధిక మాంద్యం అధిగమించాలంటే రుణం విధానం సరళంగా ఉండాలి. ప్రభుత్వాలు  పరిశ్రమలకు ఉద్దీపనలు ఇవ్వాలేగాని రుణ మాఫీలు చేయడం సరికాదు.  జీఎస్టీని ప్రభుత్వాలు ఆదాయం వనరుగా చూస్తున్నాయే తప్ప అభివృద్ధికి దిక్సూచి గా పరిగణించడం లేదు. బంగారు ఆభరణాల మీద జీఎస్టీ 3శాతంకాగా వృద్ధుల ఆరోగ్య బీమా పై 18 శాతం జీఎస్టీ బాదడమే ఇందుకు నిదర్శనం.  బంగారం పై కేవలం మహిళా ఓట్ల కోసం జీఎస్టీ తగ్గించారు. అలాగే మూలధనం లాభం పన్నును ఇటీవల బడ్జెట్లో సవరించడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరిగింది. గతంలో మూలధనం పెట్టుబడి మీద వచ్చిన లాభం పై ద్రవ్యోల్బణ రేటు తగ్గించి పన్ను వేసేవారు. ఆదాయ పన్ను పరిధిలోకి ఇది వస్తుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం పరిగణించక పన్ను రేటు పెంచి బాదేస్తున్నారు. ఫలితంగా మధ్యతరగతి,చిన్న పరిశ్రమలు, వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి సందేహిస్తున్నారు. అలాగే పన్నుచెల్లింపుదారుల ధనాన్ని సంక్షేమం పేరుతో ఓట్లు కోసం ప్రభుత్వాలు పంచుతున్నాయి. మొత్తానికి జీఎస్టీ అహేతుకత కారణంగా సామాన్యులు నలిగిపోతున్నారు. మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను తదుపరి ఎన్నికలలో తమ విజయానికి పెట్టుబడులుగా సంక్షేమం రూపంలో పందేరం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ అక్రమమే, అవినీతే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana