సింగరేణి కారుణ్య ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సోమవారం సింగరేణి సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లుగా ఉండగా, కార్మిక సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికుడు మెడికల్ ఇన్వ్యాలిడేషన్కు గురైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు.