Thursday, October 24, 2024

AP Branded Liquor : ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్- బ్రాండెడ్ బీర్లు, లిక్కర్ వచ్చేస్తున్నాయ్!

బ్రాండెడ్ మందు కోసం ఎదురుచూపులు

గత వైసీపీ పాలనలో లిక్కర్ ధరలు ఆకాశాన్ని అంటాయి. మద్య నిషేధం హామీతో ప్రభుత్వం చేపట్టిన వైసీపీ…ధరలు పెంచి మద్యం తాగే వాళ్లను నిరూత్సాహపరిచి, మద్యనిషేదం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పింది. అయితే మద్యం నుంచి ఆదాయంతోనే సంక్షేమ పథకాలు నడిచాయని అందరికీ తెలిసిన విషయమై. వైసీపీ పాలనలో భారీగా మద్యం ధరలు పెరగడంతో మందుబాబు…అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఎన్నికల్లో చంద్రబాబు హామీలకు మొగ్గుచూపారో, ఏమో తెలియదు కానీ..కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం…ఏపీలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రాండెడ్ మద్యం, బీర్లు ఇప్పటికే మద్యం గోడౌన్లలోకి చేరుతున్నారు. స్టాక్ తెప్పించి పెడుతున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్ వంటి బీర్లతో పాటు ఎన్నడూ చూడని మద్యం బ్రాండ్లతో మందుబాబు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. నాసిరకం మందును ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చేదని ఆవేదన చెందేవారు. దీంతో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు సైతం అంగీకరించేవాళ్లు కాదు. ఆ సొమ్మంతా వైసీపీ నేతలకు వెళ్లేదని ఆరోపణలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గి, నచ్చిన బ్రాండ్ దొరుకుతుందని మందుబాబుబు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana