Wednesday, October 16, 2024

IND vs PAK: కఠినమైన పిచ్‍పై తక్కువ స్కోరుకే ఆలౌటైన టీమిండియా.. అదరగొట్టిన పాక్ బౌలర్లు.. స్వల్ప లక్ష్యం

పంత్, అక్షర్ మాత్రమే..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది భారత్. అయితే, వరుసగా వికెట్లు కోల్పోతూ దూకుడుగా ఆడలేకపోయింది. రిషబ్ పంత్ (31 బంతుల్లో 42 పరుగులు; 6 ఫోర్లు) రాణించగా.. అక్షర్ పటేల్ (18 బంతుల్లో 20 పరుగులు) కాసేపు నిలిచాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. పాక్ బౌలర్లు వరసగా వికెట్లు పడగొడుతూ టీమిండియాను చిక్కుల్లో పడేశారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (4) రెండో ఓవర్లో నసీమ్ షా బౌలింగ్‍లో క్యాచౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ (13) ధాటిగా ఆడినా.. మూడో ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడారు. అయితే, రెండు క్యాచ్‍లు మిస్ అయి.. పంత్‍కు అదృష్టం కలిసి వచ్చింది. మూడో వికెట్‍కు పంత్, అక్షర్ 39 పరుగులు జోడించారు. అయితే, 8వ ఓవర్లో నసీమ్ బౌలింగ్‍లో అక్షర్ బౌల్డ్ అయ్యాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana