Home ఆంధ్రప్రదేశ్ JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ...

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

0

వేగంగా సిట్ దర్యాప్తు

పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై త్వరతిగతిన విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సిట్ ను ఆదేశించారు. దీంతో సిట్ అధికారులు రంగంలోకి దిగారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ విచారణ చేపట్టింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం సిట్ బృందం విచారణ చేసింది. అల్లర్లపై నమోదైన కేసులు, కేసులు నమోదైనా అరెస్ట్ కాని నేతల వివరాలు, సీసీ కెమెరాల వీడియోలు పరిశీలిస్తుంది. అల్లర్లపై కొన్ని కొత్త కేసులు నమోదు చేస్తుంది. రెండ్రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దీంతో ఇవాళ సాయంత్రానికి నివేదికను అందించేలా సిట్ పనిచేస్తోంది. తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై జరిగిన దాడి ఘటనను సీన్ రీక్రియేషన్ చేసి, విచారించింది సిట్‌ బృందం. అదే విధంగా ఎన్నికల తర్వాత జరిగిన ఘటనపై పోలీసు అధికారులను సైతం విచారణ చేస్తుంది. ఎస్వీయూ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులతో పాటు అల్లర్లకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ లను సిట్ అధికారులు పరిశీలించారు. నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో సిట్ బృందం దర్యాప్తు చేసింది. అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు.

Exit mobile version