Home ఆంధ్రప్రదేశ్ AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై...

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

0

AP Petrol Bunks : ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పల్నాడు, అనంతపురం, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర దాడులు జరిగాయి. అలాగే కౌంటింగ్ అనంతరం దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దిల్లీ వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులపై ఈసీకి వివరణ ఇచ్చిన సగంతి తెలిసిందే. రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇటీవల జరిగిన ఘటనపై సిట్ వేసింది. రెండ్రోజుల్లో సిట్ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేసిన ఈసీ…పలువురు పోలీసుల చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కింది స్థాయి పోలీసు అధికారులు దాడులు నిరారించడంలో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Exit mobile version