Saturday, October 19, 2024

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

బాత్రూమ్ లోనూ ఏడిపించారు..

సామీ టుష్ అమెరికాలోని ఇండియానా లో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఇంటర్మీడియట్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతడిని సహ విద్యార్థులు వేధిస్తున్నారు. సామీ టుష్ కళ్లజోడుపై, అతడి దంతాల తీరుపై ఎగతాళి చేస్తున్నారు. స్కూల్ లోనే కాకుండా, స్కూల్ బస్ లోనూ ఏడిపిస్తున్నారు. చివరకు స్కూల్ బాత్రూమ్ లో కూడా ఏడిపించారు. ఈ విషయాన్ని సామీ టుష్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు స్కూల్ యాజమాన్యానికి పలు మార్లు ఫిర్యాదు చేశారు. కానీ, సామీ టుష్ పై సహ విద్యార్థుల వేధింపులు ఆగలేదు. సుమారు 20 సార్లు ఈ వేధింపుల గురించి స్కూల్ యాజమాన్యానికి తెలియజేశామని సామీ తల్లిదండ్రులు సామ్, నికోల్ పేర్కొన్నారు. ‘మొదట్లో సామీ కళ్లద్దాలను, ఆ తర్వాత అతడి పళ్లను ఎగతాళి చేస్తూ వచ్చారు. ఇది చాలా కాలం కొనసాగింది’ అని అతడి తల్లి సామ్ తెలిపింది. ‘‘స్కూల్ బస్సులో తనను కొట్టారని, తన కళ్లద్దాలు పగులగొట్టారని సామీ టుష్ చెప్పాడు. నేను స్కూల్ కి ఫోన్ చేశాను’’ అని వివరించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana