posted on Apr 19, 2024 4:59PM
ఈ సందర్భంగా పొలిట్బ్యూరో సభ్యుడు టి.డి. జనార్థన్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల దృష్ణా ఏపీలోని జగన్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన అరాచకం, ప్రజలను వేధించిన విధానాలతో , భావితరాలకు ధన, మాన రక్షణ కరవైంది. కనుక ఏపీ లోని ఈ పరిస్థితులకు చలించిన కొంత మంది సినీ ప్రముఖులు కొన్ని పాటలను రూపొందించారు. కె.ఎస్. రామారావు, కొడాలి వేంకటేశ్వర్ రావులు కలిసి రెండు పాటలను రూపొందించారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంతకుముందే 12 పాటలను రూపొందించి ఉన్నారు. ఇప్పుడు 13వ పాటను రూపొందించి ఆ పాటను పాడటం కూడా జరిగింది. ఈ పాటలను రూపొందించడంలో ముఖ్యపాత్ర వహించిన ప్రతి ఒక్కరికీ అభినందనలను తెలియజేస్తున్నాన్నారు.
పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ… ఇటువంటి అద్భుతమైన పాటలను వినే అదృష్టం తనకు కలిగిందని అన్నారు. వినడం, చూడటం ద్వారా సమాజం ప్రభావం ఉంటుందనీ, జనం పడుతున్న అనేక రకాల ఇబ్బందులను స్పష్టంగా మన కళ్లకు కనిపించే విధంగా, చెవులలో మారుమ్రోగే విధంగా పాటలు రాసి పాడిన వారికి, నటించిన వారికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు. కొన్ని పాటలు ప్రభుత్వాన్నే మార్చిన పరిస్థితులను చూశాం. జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపర్చడం కోసం తనకు తోచిన విధంగా సహకరిస్తున్న ప్రతివ్యక్తికి, పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.
అనంతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ జగన్ పాలనలో ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించి ఏపీలో ప్రజా పరిపాలన రావాలనే ఉద్దేశంతో ప్రతి వర్గం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రం బాగు కోసం చలన చిత్ర రంగం తన వంతు బాధ్యతగా కంకణబద్దులై పని చేస్తున్నారని ప్రశంసించారు. ఈ పాటలలో ప్రతి వర్గం పడుతున్న బాధలను కళ్లకు కట్టడమే కాకుండా, ఆ బాధలను తీర్చగలిగే నాయకుడు ఎవరన్నది కూడా మనసుకు హత్తుకునే లా తెలియజేశాయని ప్రశంసించారు. పాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడాలనీ, అటువంటి ప్రభుత్వం గద్దె దిగాలని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్న సత్సంకల్పంతో ఈ బృహత్తర ఆలోచన చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలిపారు.
అనంతరం మాట్లాడిన ప్రముఖ నిర్మాత, కె.ఎస్. రామారావు ఇంత మంది, ఇంత ఇన్సిపిరేషన్తో పాటలను రాసి, తీయడానికి ప్రధాన కారణం 45 డిగ్రీల ఎండలలోనూ చంద్రబాబు ఏపీ ప్రజల కోసం కష్టపడుతుండటమేనన్నారు. చంద్రబాబు శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పవన్కళ్యాణ్ గారు మండుటెండల్లో ఏపీ బాగుండాలని కష్టపడి పని చేస్తున్నారు. ఆ ఎండల ప్రభావం ఇక్కడ ఉండే మనకు తెలియదు. ఆ మండుటెండలు ఎలా ఉంటాయో ఏపీలోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది అన్నారు. ఏడు పదుల వయస్సులో మండుటెండలో చంద్రబాబు తిరుగుతుండటం చూసి స్ఫూర్తిని పొంది కొడాలి వేంకటేశ్వర్ రావు, గుమ్మడి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి చేశారు. దేశానికి నాయకుడు కావాల్సిన చంద్రబాబు తనను తాను తగ్గించుకుని రాష్ట్రం కోసం పని చేస్తున్నారు, అటువంటి మనిషి ఏపీని అభివృద్ధి చేసుకుందామని ప్రజలను రిక్వెస్ట్ చేసుకుంటుంటే బాధ కలుగుతోందంటూ కేఎస్ రామారావు భావోద్వేగానికి గురయ్యారు.
ఏపీలో ఇంత దరిద్రపు పాలనను ఎవరూ ఊహించలేరు. చంద్రబాబు స్ఫూర్తితో ఉడతా భక్తిగా సహాయం చేయాలనే ద్దేశంతో, టి.డి. జనార్థన్ గారి ప్రోత్సాహంతో ఈ పాటలను మీ ముందుకు తీసుకొస్తు న్నామన్నారు. వీటిని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలి. ఏపీని బాగు చేసుకోవడానికి చంద్రబాబుకి మీ అందరి సహకారం కావాలి, ఆయనను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అని కేఎస్ రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత నిర్మాత, కొడాలి వేంకటేశ్వర్ రావు ఈ పాటలను టి.వి. పరిశ్రమ వారు, వర్కర్సు చేసినవి. ఈ కార్యక్రమాన్ని మొదట హేమంత్ అనే వ్యక్తి ప్రారంభించారు. నేను, కె.ఎస్. రామారావు చేసింది తక్కువ. నాని, చక్రి, అశోక్, శ్రీనివాస్ వంటి వారు వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని షూట్ చేశారు. దీనిని డైరెక్టుగా షూట్ చేసి సాంగ్స్ ను చేశాం. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాటలను చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలకు వీటిని రీఎడిట్ చేసి ప్రతి నియోజకవర్గానికి పనికివచ్చే విధంగా చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి, శిరీషా, సీబీఎన్ వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.