14వ వార్షికోత్సవ వేడుకలు
ఈ ఏడాదికిగానూ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంటర్ప్రెన్యూరర్గా రామ్ చరణ్ చేసిన సేవలకు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుకల్లో చెర్రీకి గౌరవ డాక్టరేట్ను అందించింది. అందులో రామ్ చరణ్తో పాటు డా. పి వీరముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్-చంద్రయాన్, ఇస్రో), డా. జీఎస్కే వేలు (ఫౌండర్, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్), ఆచంట శరత్ కమల్ (పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్) లను కూడా గౌరవించారు.