ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభ రాశి జాతకులు అవుతారు. కుంభ రాశి వారికి నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం 14 పాళ్లు, వ్యయం 14 పాళ్లు ఉంటుందని చిలకమర్తి వివరించారు. అలాగే రాజ్యపూజ్యం 6 పాళ్లు, అవమానం 1 పాలు ఉంటుందని తెలిపారు.