రానున్న రెండు రోజుల్లో వడగాల్పులు
ఏప్రిల్ 1న నిర్మల్, నిజామాబాద్ (Nizamabad)జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు ప్రకటింటింది. ఏప్రిల్ 2న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఏప్రిల్ 3, 4 తేదీల్లో నారాయణ పేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే రెండింతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాగల రెండు రోజుల్లో వడగాల్పులు(TS Heat Wave) తీవ్రంగా ఉంటాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు.