కీలక శాఖల మంత్రిగా
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2023 మార్చి లో అతిషి మర్లెనా (Atishi Marlena) అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ క్యాబినెట్ లో అత్యధిక శాఖలను నిర్వహిస్తున్న ఏకైక మహిళా మంత్రి ఆమె. ప్రస్తుతం ఆమె ఆర్థిక, జల, విద్య, ప్రజాపనుల శాఖ, విద్యుత్, రెవెన్యూ, న్యాయ, ప్రణాళిక, సేవలు, సమాచార, ప్రచార, విజిలెన్స్ శాఖల మంత్రిగా అతిషి ఉన్నారు.