3, 6 తరగతులకు మాత్రమే..
సిలబస్, టెక్ట్స్ బుక్స్ లో మార్పు కేవలం 3వ తరగతి, 6వ తరగతి విద్యార్థులకు మాత్రమేనని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం మూడు, ఆరో తరగతులకు సంబంధించి కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను రూపొందించే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని ఎన్సీఈఆర్టీ (NCERT) వెల్లడించింది. ఈ వివరాలను తన అనుబంధ పాఠశాలలకు సీబీఎస్సీ (CBSE) అధికారికంగా సమాచారం పంపించింది. మూడో తరగతి, ఆరో తరగతి విద్యార్థులకు త్వరలో నిర్ణయించనున్న కొత్త సిలబస్, కొత్త పాఠ్య పుస్తకాల ప్రకారమే విద్యా బోధన జరపాలని స్పష్టం చేసింది.