ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో జడేజా బౌలింగ్ లో సింగిల్ తీయడం ద్వారా కోహ్లి తన 12000వ టీ20 పరుగు పూర్తి చేశాడు. అతని కంటే ముందు ఐదుగురు బ్యాటర్లు ఈ ఘనత సాధించారు. వాళ్లలో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ రికార్డుకు చేరువగా ఉన్నాడు. రోహిత్ 426 టీ20ల్లో 11156 రన్స్ చేశాడు.