వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సుమారు మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణలో మరో ఎనిమిది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ఖరారు చేయగా, నేటి సమావేశంలో మరో ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో మొత్తం 12 మంది అభ్యర్థులను ఖరారు చేయగా మరో ఐదు స్థానాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పెండింగ్ సీట్లలో స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఈ నెల 21న మరోసారి సమావేశం కానున్నారు.
ఈరోజు 8 రాష్ట్రాలకు 50 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ అభ్యర్థులపై చర్చించారు. ఇందులో తెలంగాణ నుంచి ఎనిమిది మందిని ఖరారు చేశారు.