posted on Mar 18, 2024 8:42AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (మార్చి 18) ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు స్వామివారి సర్వ దర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (మార్చి 17) శ్రీవారిని 83వేల 825 మంది దర్శించుకున్నారు.
వారిలో 25వేల 690 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 57 లక్షల రూపాయలు వచ్చింది.