Friday, October 25, 2024

అందరికీ అందుబాటులో ఉంటా. బాధ్యతతో పనిచేస్తా…. మల్ రెడ్డి రాంరెడ్డి

తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్ రెడ్డి రామ్ రెడ్డి నియమితులైన సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు చేరుకొని ఘనంగా సత్కరించారు. పూల బొకేలు శాలువాలతో పలువురు ప్రముఖులు రామ్ రెడ్డిని అభినందించారు. అనంతరం రామ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులు, మహిళ నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana