శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు దానం నాగేందర్(BRS MLA Danam Nagender). ఈ భేటీలో ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే…. దానం కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. అయితే ఎల్లుండి పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.