గిర్జాబంధ్ వెనుక ఉన్న పురాణ కథ
గిర్జాబంధ్ ఆలయంలో హనుమంతుడిని దేవతగా ప్రతిష్టించడం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పృథ్వీ దేవ్జు రాజు ఉండేవాడు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. గొప్ప రుషులు, వైద్యులు, సాధువులు కూడా అతని రోగాన్ని నయం చేయలేకపోయారు. ఒకనాడు పృథ్వీ రాజు కలలో హనుమంతుడు కనిపించి తన పేరుని ధ్యానించి ఆలయం నిర్మించమని చెప్పాడట. రాజు తాను చేయగలిగినంతగా హనుమంతుడికి అత్యుత్తమ ఆలయాన్ని నిర్మించాడు.